ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోనసీమ అల్లర్లలో సూత్రధారి వైసీపీ నాయకుడే: టీడీపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 01:59 PM

కోనసీమలో మంగళవారం చోటు చేసుకున్న అల్లర్లు దురదృష్టకరమని, ఆ విషయంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. మీడియాతో బుధవారం మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అమలాపురంలో జరిగిన విధ్వంసకాండలో టీడీపీ, జనసేన ఉన్నాయని వైసీపీ దుష్ప్రచారం చేస్తోందన్నారు. అయితే పోలీసులు సూత్రధారిగా అన్నం సాయి అనే వ్యక్తిని చెబుతున్నారని, అతడు వైసీపీ నాయకుడని అచ్చెన్న పేర్కొన్నారు. గతంలో అన్నం సాయిని సజ్జల రామకృష్ణారెడ్డి కౌగలించుకున్న ఫొటోను మీడియాకు అచ్చెన్న విడుదల చేశారు.


శాంతిభద్రతలను అదుపు చేయలేని ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ప్రజలకు సమాధానం చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. వైసీపీ వారే అల్లర్లు సృష్టించి, ఇతరుపై వాటిని నెడుతున్నారన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన కారు డ్రైవరును హత్య చేశాడని, ప్రజల దృష్టిని మరల్చేందుకే కోనసీమ అంశాన్ని ప్రభుత్వమే రెచ్చగొట్టిందన్నారు. సీఎం వైఎస్ జగన్ డైవర్షన్ పాలిటిక్స్ అమలు చేస్తున్నట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com