ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 21, 2022, 12:30 PM

నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందుగానే రానున్నాయి. ఏటా జూన్ 1న కేరళను నైరుతి పవనాలు తాకుతాయి. అయితే ఈ ఏడాది మే 25నే రుతు పవనాలు తాకనున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో కర్నాటక, కేరళ రాష్ట్రాలలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.


ఇక తెలంగాణలోనూ రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ క్రమంలో ఉత్తర దక్షిణ ద్రోణి ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ అంతర్గత కర్నాటక మీద కొనసాగుతోందని తెలిపింది. ఉపరితల ఆవర్తనం వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నట్లు వెల్లడించింది. ఈ ప్రభావంతో హైదరాబాద్ నగరంతో సహా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలలో వర్షాలు పెడతాయని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com