ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ పార్టీలో ఐతే మంచోడు, మా పార్టీలో ఐతే పక్కరాష్ట్రంవాడా ....?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 19, 2022, 03:45 PM

నీ పాలనలో ఏ ఒక్క వర్గానికైనా మేలు చేశావా అంటూ రాయచోటి ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి శ్రీ‌కాంత్‌రెడ్డి చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు. ఈ దేశంలో బ్యాంకులు అన్నింటినీ వేల కోట్లకు ముంచేసి తనకు ఆ డబ్బులు తీసుకువచ్చి ఇచ్చిన వారికి ఒకప్పుడు చంద్రబాబు రాజ్యసభ సీట్లు ఇచ్చాడు. బ్యాంకుల్లో వేల కోట్లు అప్పులు తీసుకుని ఎగ్గొట్టి దేశానికి ఎంతో నష్టం చేసిన వ్యక్తులను చంద్రబాబు రాజ్యసభ సభ్యులుగా చేసిన చరిత్ర మనం చూశాం. అలాగే వారు బ్యాంకులకు ఎగ్గొట్టిన డబ్బులన్నీ కూడా చంద్రబాబు వద్దకు చేరాయి. అలాంటి వారిని రాజ్యసభకు పంపారు చంద్రబాబు.  అలాంటి ఆయన ఇవాళ మాపై విమర్శలు చేస్తున్నారు. పక్క రాష్ట్రం వారికి రాజ్యసభ టికెట్లు ఇచ్చామని అంటున్నారు. ఇద్దరు బీసీలకు వరుసగా రెండోసారి రాజ్యసభ సీట్లు ఇస్తే.. పక్క రాష్ట్రం అంటూ నసుగుతున్నాడు. కృష్ణయ్య గారికి ఇచ్చారు అని మాట్లాడుతున్నారు. కృష్ణయ్య గారు తెలంగాణకు చెందిన వారు అయినా, బీసీల సంక్షేమం కోసం దాదాపు 40 ఏళ్ల నుంచి దేశవ్యాప్తంగా పోరాడుతున్న వ్యక్తి. బీసీలు గుర్తించిన వ్యక్తి. ఇది అందరికీ కూడా తెలుసు. తన పార్టీలో ఉంటేనేమో కృష్ణయ్య గొప్ప వాడు. అదే ఆయన వైయస్‌ఆర్‌సీపీలో ఉంటే ప్రక్క రాష్ట్రం వాడి కింద లెక్కలోకి వస్తాడు. ఇది ఏ మాత్రం విలువలేని చంద్రబాబు రాజకీయం అని ఎద్దేవా చేసారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com