ఐసీసీ వన్డే ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత మహిళా క్రికెట్ జట్టును ప్రకటించారు. మిథాలీ రాజ్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా, హర్మన్ప్రీత్ కౌర్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. స్మృతి మంధాన, ఝులన్ గోస్వామి, యువ షెఫాలీ వర్మ కూడా జట్టులోకి వచ్చారు. కానీ చాలా మంది కీలక ప్లేయర్లు జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. వీరిలో స్టార్ బ్యాట్స్మెన్ జెమీమా రోడ్రిగ్స్, ఆల్ రౌండర్ శిఖా పాండే ఉన్నారు. వీరే కాకుండా టీమ్కి దూరంగా ఉన్న కొందరు పేర్లు కూడా ఉన్నాయి.
జట్టు: మిథాలీరాజ్ (కెప్టెన్), హర్మన్ప్రీత్ (VC), స్మృతి, షఫాలీ, యస్తిక, దీప్తి, రిచాఘోష్ (WK), స్నేహ్ రానా, జులన్, పూజ, మేఘనా సింగ్, రేణుకా సింగ్, తానియా (WK), రాజేశ్వరి, పూనమ్.