ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ జాగ్రత్తలతో మెదడు చురుకుదనం

national |  Suryaa Desk  | Published : Tue, Sep 21, 2021, 03:43 PM

ఇంటి పనులు, వంట పని, అయిన వాళ్ల బాధ్యత, ఆర్థిక వ్యవహారం, ఆఫీసు పనుల హడావిడిలో ఆడవాళ్లకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ ఒత్తిడి ఇలా కొనసాగితే.. రకాలరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఆదిలోనే ఈ ఒత్తిడిలోంచి బయటపడాలి. లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకుంటే.. ఈ ఒత్తిడి చాలా సులభంగా జయించవచ్చు. తినే ఆహారం, వ్యాయామం, సరేన నిద్ర.. ఒత్తిడిని బయటపడేస్తాయి.


మన మెదడు చురుగ్గా ఉండటానికీ సమతుల ఆహారం అవసరం. ముఖ్యంగా తక్కువ గ్లైసమిక్‌ ఇండెక్స్‌ ఉండే ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ద్రాక్ష, అరటి, మామిడి, బొప్పాయి, ఖర్జూర, అంజీర, చేపలు, అవిసె గింజలు వంటివి తీసుకోవాలి. వీటిల్లో ఎక్కువగా ఉండే పీచు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్‌ మానసికంగా, శారీరకంగా చురుగ్గా ఉంచుతాయి. అదేవి ధంగా మెదడు చురుగ్గా పని చేయాలంటే దానికి తగిన పని ఉండాలి. అందుకోసం పుస్తకాలు, పేపర్లు, మ్యాగజైన్స్ చదవడం అలవాటు చేసుకోవాలి. ఇలాంటివి జ్ఞాపకశక్తిని పెంచుతాయి.


వ్యాయామం, వాకింగ్‌లను జీవితంలో భాగం చేసుకోవాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా చేసే వ్యాయామాలు ఒత్తిడి లేకుండా చేస్తాయి. తెల్లవారుజామున చేసే వ్యాయామాలు శారీరక శక్తినే కాక.. మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి.


ఒత్తిడి తగ్గడానికి సరైన నిద్ర కూడా చాలా అవసరం. తగిన విశ్రాంతీ తప్పనిసరిగా ఉండాలి. ఇది శరీరాన్నే కాదు మనసునీ తేలికపరుస్తుంది. ఫలితంగా చక్కటి నిద్రా సొంతమవుతుంది. ఇవి ఒకదానికొకటి సహకరించుకోవడం వల్ల మెదడు పనితీరులోనూ మార్పు వస్తుంది. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. దీంతో ఆరోగ్యంగా ఉండొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com