ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఇద్దరు పైలెట్లలతో ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ జమ్మూ కశ్మీర్లోని ఉధంపూర్కు సమీపంలోని శివ్ గఢ్ ధార్ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఆకాశంలో దట్టమైన పొగమంచు వ్యాపించడంతో సిగ్నల్ సరిగా కనిపించక హెలికాప్టర్ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై స్పందించిన ఉధంపూర్ డీఐజీ సులేమాన్ చౌదరి మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందిందని తెలిపారు. శివ్ గఢ్ ధార్లో ఘటన స్థలానికి రెస్క్యూ బృందాలను పంపించామని తెలిపారు. ఈ ప్రాంతంలో అధిక పొగమంచు ఉందని తెలిపారు. రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ఇద్దరు ఆర్మీ పైలెట్లలను బయటకు తీసుకువచ్చారని పేర్కొన్నారు.