విశాఖపట్టణం: బైక్ ను ఢీకొట్టి తప్పించి పోతున్న ఆటో డ్రైవర్ ను వెంబడించి పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం సాయంత్రం నర్సీపట్నంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నర్సీపట్నం మండలం అప్పన్నపాలెం గ్రామానికి చెందిన భార్య భర్తలు తమ కొడుకుతో బైక్ పై ఆబిడ్స్ వైపు వెళుతుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ తో పాటు కిందపడిన మహిళ బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోను ఆపకుండా తప్పించుకు పోతున్న డ్రైవర్ ను ట్రాఫిక్ ఎస్ఐ దివాకర్ పోలీస్ సిబ్బందితో ఆటోను వెంబడించి నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాలి గాయంతో బాధపడుతున్నా లెక్క చేయకుండా సాహసంతో వెంటబడి పట్టుకున్న ఎస్సై దివాకర్ ను పలువురు అభినందిస్తున్నారు.