ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. వీరు అదృశ్యం కావడంపై తల్లిదండ్రులు భయాందోళనలో ఉన్నారు. కంభం పట్టణానికి చెందిన మహబూబ్ బాషా (8) అలియాస్ అషు, శివ(12) అనే ఇద్దరు చిన్నారులు ఈనెల 17వ తేదీ నుండి కనిపించకుండా పోయారు.
పలు ప్రదేశాలలో గాలింపు చర్యలు చేపట్టిన తల్లిదండ్రులు తమ పిల్లల ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన చెంది స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మూడు రోజులు నుంచి తమ పిల్లలు ఆచూకీ తెలియకపోవడంతో చాలా భయంగా ఉంది అంటూ చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తమ ఆవేదనను అర్థం చేసుకొని తమ పిల్లలు ఎక్కడున్నారో ఆచూకీ తెలుసుకుని సురక్షితంగా ఇంటికి చేరల చూడాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.