కేరళలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాలలో కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేయనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ వి పి జాయ్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వీక్లీ ఇన్ఫెక్షన్ పాపులేషన్ రేషియో(డబ్ల్యుఐపీఆర్) 10శాతం కన్నా అధికంగా ఉన్న జిల్లాల్లో కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేయనున్నామని తెలిపారు. గడచిన 24 గంటల్లో కేరళలో కొత్తగా 19,653 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 152 మంది కన్నుమూశారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 45,08,493కు చేరుకుంది. కరోనా మృతుల సంఖ్య 23,591కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,73,631 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
బీజేపీలో చేరిన హైకోర్టు మాజీ జడ్జీలు ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు సాయంత్రం 6 గంటల వరకు ఆర్టీసీ బస్సులు గంటల వ్యవధిలోనే కరోనాకు ఇద్దరు కొడుకులు బలి.. వ్యాక్సినేషన్పై తల్లి కీలక వ్యాఖ్యలు..