హైదరాబాద్: ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డ్కి చేరువలో ఉన్నాడు. ఐపీఎల్ 2021 సీజన్ రెండో దశ మ్యాచ్లు ఆదివారం నుంచి ప్రారంభంకానుండగా.. దుబాయ్ వేదికగా ఫస్ట్ మ్యాచ్లోనే చెన్నై సూపర్ కింగ్స్తో ముంబయి ఇండియన్స్ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 3 సిక్సర్లు కొడితే..? టీ20ల్లో 400 సిక్సర్లు నమోదు చేసిన భారత తొలి క్రికెటర్గా హిట్మ్యాన్ అరుదైన ఘనత సాధించనున్నాడు.
ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి ఆడుతున్న రోహిత్ శర్మ.. ఇప్పటి వరకూ 207 మ్యాచ్లాడి 224 సిక్సర్లు నమోదు చేశాడు. ఇందులో ముంబయి ఇండియన్స్ టీమ్కి ఆడుతూ ఏకంగా 173 సిక్సర్లు బాదిన హిట్మ్యాన్.. మిగిలిన 51 సిక్సర్లు దక్కన్ ఛార్జర్స్ తరఫున తొలి మూడు సీజన్లలో ఆడి నమోదు చేశాడు. ఇక భారత్ తరఫున 111 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లాడిన రోహిత్ శర్మ 133 సిక్సర్లు బాదగా.. మిగిలిన 40 సిక్సర్లు దేశవాళీ టీ20 టోర్నీల్లో నమోదు చేశాడు. ఓవరాల్గా భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాని పరిశీలిస్తే..? రోహిత్ శర్మ 397 సిక్సర్లతో టాప్లో ఉండగా.. ఆ తర్వాత సురేశ్ రైనా (324 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (315), మహేంద్రసింగ్ ధోనీ (303) టాప్-4లో కొనసాగుతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. క్రిస్గిల్ ఇప్పటికే టీ20ల్లో 1,000 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు.