దక్షిణమధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. కొన్ని రైళ్లను దారి మళ్లించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాజీపేట-కొండపల్లి సెక్షన్ల మధ్య జరుగుతున్న అభివృద్ధి పనుల కారణంగా పలు రైలు సర్వీసులకు అంతరాయం కలుగుతోందని తెలిపింది. ‘గుంటూరు-సికింద్రాబాద్ (02705), సికింద్రాబాద్-గుంటూరు(02706) రైళ్లు సెప్టెంబరు 9న, డోర్నకల్-విజయవాడ(07755), విజయవాడ-డోర్నకల్ (07756) రైళ్లు సెప్టెంబరు 2, 3, తేదీల్లో రద్దయ్యాయి. ఆదిలాబాద్-తిరుపతి (07406) రైలును 4వ తేదీన ముద్కేడ్, నిజామాబాద్, సికింద్రాబాద్, పగిడిపల్లి, గుంటూరు తెనాలి మీదుగా దారి మళ్లించినట్లు వెల్లడించింది.