టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు మరో పతకం దక్కింది. మంగళవారం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్హెచ్1 ఈవెంట్ లో సింఘ్రాజ్ అధానా బ్రాంజ్ మెడల్ గెలిచాడు. ఫైనల్లో అతడు 216.8 పాయింట్లు సాధించాడు. దీంతో భారత్ ఇప్పటి వరకూ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 8కి చేరింది. ఇందులో 2 గోల్డ్, 4 సిల్వర్, మరో 2 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. భారత్ సోమవారం ఒక్కరోజే 5 మెడల్స్ గెలిచిన విషయం తెలిసిందే.