గుంటూరు : రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మంగళగిరి బైపాస్ రోడ్డులో దంపతులిద్దరూ ద్విచక్ర వాహనంపై వెళుతుండగా.. టాటా ఏసీ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళుతున్న భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. దంపతులిద్దరూ వివాహానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.