ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతుకు వింత సమస్య.. తెలిస్తే షాకవుతారు!

national |  Suryaa Desk  | Published : Tue, Aug 24, 2021, 05:27 PM

రైతులు పంటలు పండించడానికి ఎన్ని కష్టాలు పడతారో అందరికీ తెలిసిందే. స‌కాలంలో వ‌ర్షాలు కుర‌వ‌క‌పోతే రైతును పంట‌ను పండించ‌లేరు. భారీ వ‌ర్షాలు కురిసి వరదలు వచ్చినా పంట‌కు న‌ష్టం వ‌స్తుంది. అయితే ప్ర‌కృతి విప‌త్తుల కార‌ణంగా పంట‌లు న‌ష్ట‌పోయిన రైతుల‌కు ప్ర‌భుత్వం పరిహారం ఇస్తుంది. ఈ ప‌రిహారం కోసం ఒక్కోసారి రైతులు కాళ్లు అరిగేలా అధికారుల చుట్టూ తిర‌గాల్సి వస్తుంది. వ‌చ్చిన మొత్తంలో కొంత స‌మ‌ర్పిస్తేనే ప‌నులు జరుగుతాయి.


అయితే తాజాగా హ‌ర్యానాలో ఓ రైతుకు వింత స‌మ‌స్య ఎదురైంది. ఆ రైతుకు 20 ఎక‌రాల పంట‌పోలం ఉంది. అతనికి 2 ఎక‌రాల్లోని పంటకు మాత్ర‌మే స‌ష్ట‌ప‌రిహారం రావాల్సి ఉంది. కానీ 10 ఎక‌రాల్లో పంట న‌ష్టం వ‌చ్చిందని అధికారులు రికార్డుల్లో రాసుకున్నారు. రైతు ఖాతాలో రూ.70 వేలు జ‌మ‌చేశారు. న్యాయంగా త‌న‌కు రావాల్సింది కేవ‌లం రూ.14 వేలు మాత్ర‌మే అని ఆ రైతు తెలిపాడు. మిగ‌తా రూ.56 వేలు త‌న‌కు అవ‌స‌రం లేద‌ని ఆ రైతు అధికారులకు ఇచ్చేందుకు ప్ర‌య‌త్నం చేశాడు. కానీ గ‌త ఆరేళ్లుగా ఆ రైతు ఆధికారుల చుట్టూ తిరుగుతున్నా వారు డ‌బ్బులు వెనక్కి తీసుకోవ‌డం లేద‌ని ఆ రైతు వాపోతున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com