గుంటూరు జిల్లా, పొన్నూరు మండలం ములుకుదురు గ్రామం జిబిసి రోడ్డుపై మంగళవారం ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పొన్నూరు రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. బాపట్ల మండలం మూలపాలెం గ్రామానికి చెందిన బొడుగు ప్రకాష్ పొన్నూరులోని ఓ వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి ద్విచక్రవాహనంపై స్వగ్రామం వెళుతుండగా ములుకుదురు గ్రామం జిబిసి రోడ్డుపై ఆర్టీసీ బస్సు ప్రకాష్ ను ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. పొన్నూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.