ఏపీలోని రిజిస్ట్రార్ల ఆఫీసుల్లో చలనాల స్కామ్ పై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ రిజిస్ట్రార్ల ఆఫీసుల్లో నకిలీ చలానాలు ఎలా వచ్చాయని అధికారులను ప్రశ్నించారు. ఏసీబీ దాడులు చేస్తే తప్ప ఈ వ్యవహారం వెలుగులోకి రాలేదని, వ్యవస్థలు సవ్యంగా నడుస్తున్నాయో లేదో అధికారులు పట్టించుకోవడం లేదని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని కార్యాలయాల్లో చలాన్ల ప్రక్రియను పరిశీలించాలని అన్నారు. కాల్ సెంటర్లకు వచ్చే ఫోన్ కాల్స్ పై అధికారులు దృష్టిపెట్టాలన్నారు.