అమరావతి: ప్రపంచ నర్సులు దినోత్సవం సందర్భంగా నర్సులందరికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా సమయంలో నర్సుల సేవలు అనిర్వచనీయమన్నారు. కరోనాపై పోరాటంలో నర్సుల సంకల్పం స్ఫూర్తి దాయకమని తెలిపారు. ప్రాణాలు పణంగా పెట్టి ప్రజాసేవ చేస్తున్న నర్సుల రుణం తీర్చుకోలేనిదని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.