2020-21 ఆర్థిక సంవత్సరంలో 10 ప్రభుత్వ రంగాలకు చెందిన 2118 బ్యాంక్ బ్రాంచ్ లు మూసి వేశారు. అయితే వీటిని ఎందుకు క్లోజ్ చేశారన్న అంశంపై ఆర్బీఐ స్పష్టత నిచ్చింది. సమాచార హక్కు చట్టం కింద ఈ విషయాన్ని వెల్లడించింది. బ్యాంకుల విలీనం కారణంగా ఈ స్థాయిలో బ్యాంక్ బ్రాంచ్ లు మూత పడ్డాయని పేర్కొంది. 2118 బ్రాంచ్ ల్లో బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన 1283 బ్రాంచులు ఉండగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించినవి 332, పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సంబంధించినవి 169, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియావి 124, కెనరా బ్యాంక్ 107, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వి 53, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియావి 43, ఇండియన్ బ్యాంక్ వి 5 బ్రాంచులు ఉన్నాయి. ఇవి శ్వశ్వతంగా మూసివేయడం లేదా ఇతర బ్యాంక్ లకు బ్యాంచ్ లుగా మారిపోయే అవకాశం ఉంది.