పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్నాడు. మహిళల క్రికెట్ లో ఆస్ట్రేలియా టీమ్ వికెట్ కీపర్ అలీసా హీలీని ఈ అవార్డుకు ఎంపిక అయ్యింది. ఏప్రిల్ లో అద్భుతమైన ప్రదర్శన చేసినందుకువారికి ఈ అవార్డులు దక్కాయి. సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ లో అన్ని ఫార్మాట్ లలో నిలకడగా రాణించిన ఆజమ్ కు అభిమానులు పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించారు. ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో 82 బంతుల్లో 94 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన బాబర్ ఆజం.. 13 పాయింట్లు సాధించి మొత్తం 865 పాయింట్లతో కెరీర్ బెస్ట్ సాధించాడు. ఇక అదే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ గెలవడంలోనూ బాబర్ కీలకపాత్ర పోషించాడు.