ఏపీ సరిహద్దుల్లో తెలంగాణ అధికారులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కరోనా బాధితును తీసుకు వస్తున్న అంబులెన్సులకు తెలంగాణలోకి అనుమతి ఇవ్వడం లేదు. దీంతో కరోనా రోగులు బార్డర్ లో పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. తెలంగాణలో ఆక్సిజన్ కొరత కారణంగా తమ రాష్ట్రంలోకి అనుమతి ఇవ్వడం లేదని దయచేసి అర్ధం చేసుకొని వెనక్కి వెళ్లాలని పోలీసులు బాధితులను కోరుతున్నారు. అధికారుల ఆంక్షలతో రాష్ట్ర సరిహద్దు విజయవాడ-తెలంగాణ హైవే రామాపురం క్రాస్ రోడ్డు, కర్నూలు బార్డర్ వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది.