ఏపీలో కరోనా టీకా పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికలను రూపొందించింది. ఏపీలోని అన్ని జిల్లాల్లో నేడు, రేపు వ్యాక్సిన్ పంపిణీని నిలిపివేసింది. టీకా కేంద్రాల వద్ద రద్దీ, తోపులాటతో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహం మార్చింది. ఇకపై ఓటర్ల స్లిప్పుల తరహాలో వ్యాక్సిన్ స్లిప్పులు ఇవ్వనున్నారు. ఎవరికి ఏ టైం కి వ్యాక్సిన్ వేసే సమాచారం స్లిప్పుల ద్వారా ఇంటివద్దకే అందజేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల ద్వారా స్లిప్పులు పంపిణీ చేయనున్నారు. అర్బన్ ప్రాంతాల్లో ఎస్ఎంఎస్ ల ద్వారా సమాచారం అందజేయనున్నారు. రెండో డోసు వ్యాక్సిన్ పంపిణీ పూర్తయ్యాకే మొదటి డోసు వ్యాక్సిన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి డోసు ఎక్కడ వేసినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.