ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధోనీకి రూ.12 లక్షల జరిమానా

national |  Suryaa Desk  | Published : Mon, Apr 12, 2021, 04:26 PM

శనివారం ఆడిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి పాలై ఒత్తిడిలో ఉన్న CSK కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మరో షాక్ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ధోనీకి రూ.12 లక్షల జరిమానా విధించారు. ధోనీ చేసిన తొలి తప్పుగా దీనిని పరిగణించి ఆయనపై కేవలం జరిమానా వేసి వదిలేశారు. నిన్నటి మ్యాచ్‌లో ధోనీ డకౌటయ్యాడు. ధోనీ 2015లో ఐపీఎల్‌లో చెన్నై టీమ్ తరఫున ఆడి డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత మళ్లీ ధోనీ డకౌట్ కావడం ఇదే తొలిసారి. శనివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఇచ్చిన 189 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ టీమ్‌ సునాయాసంగా ఛేదించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com