ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్‌లకు చెక్..ఇండియా యాప్ విడుదల

national |  Suryaa Desk  | Published : Mon, Jul 06, 2020, 04:56 PM

భారత దేశానికి చెందిన మొట్టమొదటి అధికారిక సోషల్ మీడియా యాప్ ఎలిఎంట్స్ (Elyments)ను దేశ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విడుదల చేశారు. ఈ యాప్‌ను వెయ్యి మందికి పైగా ఐటీ నిపుణులు అభివృద్ధి చేయగా, శ్రీశ్రీ రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఈ యాప్ తయారీ బాధ్యతలు చేపట్టింది. వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు ఈ యాప్‌ విడుదల సందర్భంగా మాట్లాడుతూ... 'భారతదేశం ఒక ఐటి పవర్‌హౌస్ అని ఈ రంగంలో ఇప్పటికే ప్రపంచంలోని ప్రసిద్ధ వ్యక్తులు ఉన్నారు. చాలా మంది ప్రతిభావంతులైన నిపుణులతో, రాబోయే కాలంలో ఇలాంటి మరిన్ని ఆవిష్కరణలు చేయాలని తాను ఆశిస్తున్నాను. ' అని తెలిపారు.సోషల్ మీడియా ప్రపంచంలో, Elyments యాప్ ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి దిగ్గజాలతో పోటీ పడనుందని, ఈ యాప్ ప్రస్తుతం 8 భాషలలో అందుబాటులో ఉందని తెలిపారు. అలాగే Elyments app గూగుల్ ప్లే స్టోర్‌లో 1 లక్ష కన్నా ఎక్కువ సార్లు డౌన్‌లోడ్ చేసినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అలాగే ప్లే స్టోర్ ప్రకారం, ఈ యాప్ ద్వారా, వినియోగదారులు వారి స్నేహితులతో కనెక్ట్ అవ్వవచ్చు, చాట్ చేయవచ్చు. ఇది కాకుండా, మీరు అపరిమిత వాయిస్, వీడియో కాల్స్ చేసే వీలుంది.ముఖ్యంగా Elyments App సర్వర్‌లన్నీ భారతదేశంలోనే ఉన్నాయి. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ స్వయం సమృద్ధిగా ఉన్న భారత ప్రచారాన్ని కూడా ప్రకటించారు. దీని కింద దేశంలో యాప్‌లను అభివృద్ధి చేయాలని వ్యవస్థాపకులు, ఆవిష్కర్తలకు విజ్ఞప్తి చేశారు. టిక్ టాక్ సహా 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో ప్రస్తుతం మేడ్ ఇన్ ఇండియా యాప్‌లలో వేగంగా పెరుగుదల కనిపించింది. దీంతో రాబోయే రోజుల్లో మరిన్ని ఆవిష్కరణలు జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com