ఏపీలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని టీడీపీ పిలుపునిచ్చింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు జూలై 6న గ్రామ, మండల కేంద్రాలలో హౌసింగ్ పెండింగ్ బిల్లులు, ఇళ్లు స్వాధీనం చేయకపోవడంపై.. టీడీపీ హయాంలో నూతనంగా నిర్మించిన భవన సముదాయాల దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. టీడీపీ శ్రేణులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు తప్పనిసరిగా ధరించి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆ పార్టీ పిలుపునిచ్చింది. అమరావతి ఆందోళనలు మొదలై 200 రోజులైన సందర్భంగా రాజధాని రైతులు నిర్వహించిన నిరసన కార్యక్రమానికి టీడీపీ మద్దతు పలికింది.