విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన మహారాష్ట్రలోని తలొజా జైలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని జైలు సిబ్బంది వరవరరావు భార్యకు ఫోన్ చేసి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై 2018 నవంబర్లో అరెస్టైన వరవరరావును మొదట మహారాష్ట్ర పుణె లోని ఎరవాడ జైలుకు తరలించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎరవాడ నుంచి నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించారు. తన ఆరోగ్యం బాగా లేదని బెయిల్ ఇవ్వాలని వరవరరావు కోర్టులో పిటిషన్ వేయగా కోర్టు కొట్టేసింది.