ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలు: జిల్లాలో కరోనా విశ్వరూపం...2120కి చేరిన కేసుల సంఖ్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 03, 2020, 03:57 PM

కర్నూలు జిల్లాలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. గత కొద్దిరోజులుగా జిల్లా ప్రజలను హడలెత్తిస్తోంది. జిల్లా వ్యాప్తంగా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా జిల్లాలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజలు భయంతో హడలిపోతున్నారు. మెున్నటి వరకు కరోనా దెబ్బకు పట్టణాలన్నీ వణికిపోయాయి. తాజాగా కరోనా దెబ్బకు పల్లెటూర్లు సైతం వణికిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో 75 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దాంతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2120కి చేరుకున్నాయి.ఇకపోతే జిల్లాలో 993 మంది ఐసోలేషన్ వార్డులో చికిత్సపొందుతుండగా 1058 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంట్లలో జిల్లాలో ఒకరు కరోనాతో మరణించారు. ఇప్పటి వరకు జిల్లాలో కరోనా మహమ్మారి బారినపడి 69 మంది మరణించారు. ఇకపోతే జిల్లాలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com