ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ముగ్గురికి వైసీపీ కీలక బాధ్యతలు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 03, 2020, 03:56 PM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ దృష్టి సారించారు. అందులో భాగంగా పార్టీలో ముగ్గురు సీనియర్‌ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. జిల్లాల వారీగా పార్టీ బాధ్యతలను రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగిస్తూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు.విజయసాయిరెడ్డికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల బాధ్యతలు, వైవీ సుబ్బారెడ్డికి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల బాధ్యతలు, సజ్జల రామకృష్ణారెడ్డికి నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, వైఎస్సాఆర్‌ జిల్లాల బాధ్యతలు అప్పగించారు. మరోవైపు తాడేపల్లిలో ఉన్న వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయ సమన్వయ బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డి చూడాలని జగన్ ఆదేవించారు. పార్టీ అనుబంధ విభాగాల బాధ్యతలను విజయసాయిరెడ్డికి అప్పగించారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com