వైసీపీ నేత, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డికి కరోనా పాజిటివ్ గా తేలినట్టు ఎన్టీవీ కథనం ఆధారంగా తెలుస్తోంది. ఇటీవలే ఎమ్మెల్యే కరోనా పరీక్షలు చేయించుకోగా ఆ రిపోర్టుల్లో పాజిటివ్ గా తేలినట్టు వైద్యులు నిర్దారించారు. అదే విధంగా ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి,ఆయన భార్యకు కూడా కరోనా పాజిటివ్ గా తేలినట్టు వైద్యులు తేల్చారు. ప్రస్తుతం వీరు హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం. వీరితో కాంటాక్టు అయిన వారంతా హోం క్వారంటైన్ కు వెళ్లారు.