ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ కరోనా బులిటెన్ విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 03, 2020, 02:38 PM

ఏపీని కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 38, 898 నమూనాలను పరిక్షించగా 789 మందికి కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 14,414కు చేరింది. ఇందులో 6,126 మంది ఇప్పటివరకు డిశ్చార్జ్ కాగా, 206 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 8,082. తాజాగా కర్నూల్ జిల్లాలో నలుగురు, చిత్తూరులో ఇద్దరు, కృష్ణ, తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కరు చొప్పున కరోనా బారినపడి చనిపోయారు. తాజాగా జిల్లాల వారీగా అనంతపురంలో 149, చిత్తూరులో 47, ఈస్టు గోదావరి 56, గుంటూరు 80, కడప 19, కృష్ణ 17, కర్నూలు 116, నెల్లూరు 15, ప్రకాశం 139, శ్రీకాకుళం 30, విశాఖపట్నం 54, విజయనగరం 10, వెస్ట్ గోదావరిలో 57 కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఇవి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 46 మందికి, ఇతర దేశాల నుంచి వచ్చిన ఇద్దరికి వైరస్ సోకినట్లు అధికారులు ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com