భారత ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంతో చైనాకు మరో షాక్ తగలబోతోంది. ఇప్పటికే 59 చైనీస్ మొబైల్ అప్లికేషన్లపై నిషేధం విధించింది. ఇకపై జాతీయ రహదారి నిర్మాణ ప్రాజెక్టుల్లో చైనా సంస్థలపై నిషేధం విధించనున్నట్లు ప్రకటించింది. హైవే ప్రాజెక్టుల్లో ఇకపై చైనా కంపెనీలను అనుమతించబోమని రోడ్డు రవాణా, హైవేలు, ఎంఎస్ఎంఈ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. హైవే ప్రాజెక్టుల్లో పాల్గొనే చైనా సంస్థలపై నిషేధం విధించేలా త్వరలోనే ఓ విధానాన్ని తీసుకువస్తామని ఆయన తెలిపారు.