ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాంధీ మెచ్చిన రత్నం గారి పెన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 02, 2020, 12:39 PM

చరిత్ర సాక్ష్యాలు రాజమహేంద్రవరంలో లభిస్తాయి. కళలకు, సంస్కృతికి నిలమైన రాజమహేంద్రవరం స్వాతంత్య్ర సమరవీరులకు, త్యాగధనులకూ పెట్టింది పేరు. ఇక కీలకమైన స్వాతంత్య్ర పోరాటంలో స్వదేశీ స్ఫూర్తిని జీర్ణించుకుని ఎన్నో కార్యక్రమాలకు వేదికగా నిలిచిన ఈ నగరం 'కలం' (పెన్ను) పరిశ్రమకు రత్నం పెన్ వర్క్స్ శ్రీకారం చుట్టింది. రత్నం పెన్ భారతదేశంలో తయారైన మొట్టమొదటి ఫౌంటెన్ పెన్. 1930లోరాజమహేంద్రవరంలో ఫౌంటెన్ పెన్‌లు తయారు చెయ్యడం ప్రారంభించిన రత్నం పెన్ వర్క్స్ మూడో తరంలో కూడా కలాలు తయారు చేస్తోంది.85 ఏళ్ళ ప్రస్థానంలో అనేక ప్రశంసలు అందుకుంది. స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో పెన్నుల రంగంలో అడుగుపెట్టి, అలనాడు గాంధీజీ ప్రశంసలు అందుకున్న రత్నం పెన్ ఇప్పుడు మూడవ తరం భాగస్వామ్యంతో రత్నంపెన్, రత్నం బాల్ పెన్ వర్క్స్‌గా విరాజిల్లుతోంది.ఎందరో ప్రముఖులు ఈ సంస్థను సందర్శించి ముగ్దులయ్యారు. స్వాతంత్య్ర సమర స్ఫూర్తితో స్వదేశీ నినాదానికి వేదికగా నిలిచిన ఈ సంస్థ 85 ఏళ్ళు పూర్తి చేసుకుంది. కె.వి.రత్నం బ్రదర్స్ పేరిట స్వర్గీయ కోసూరి వెంకటరత్నం నెలకొల్పిన రత్నం పెన్స్ సంస్థ రత్నం హయాంలోనే రత్నం పెన్ వర్క్స్, రత్నం బాల్‌పెన్ వర్క్స్ గా విభజించారు. ప్రస్తుతం రెండు సంస్థలూ వ్యాపారం రంగంలో జోరుగా సాగుతున్నాయి ఈ సందర్భంగా సంస్థ అధినేత రమణ మూర్తి మాట్లాడుతూ ప్రధానమంత్రి నెహ్రూ నుంచి మోదీ వరకు మా సంస్థ తయారు చేసిన పెన్నులు ఉపయోగించడం జరిగిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com