కరోనా బారిన పడి తిరుపతి స్విమ్స్ లో చికిత్స పొందుతున్న కర్నూలు యువకుడు మృతి చెందాడు. కర్నూలు జిల్లా పెద్దబోదారం ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువకుడు అనారోగ్యంతో గత 29న స్విమ్స్ లో చికిత్స కోసం వచ్చాడు. కరోనా లక్షణాలు ఉన్నట్టు అనుమానించి అతడిని ప్రత్యేక గదిలో ఉంచి వైద్యసేవలు అందించారు . అదేరోజు కరోనా నిర్ధారణ పరీక్షలకు స్వాబ్ సేకరించి పంపారు అతను చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతిచెందాడు. ఇదే రోజు సాయంత్రం అందిన రిపోర్టుల్లో అతనికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది . తిరుపతిలోని గోవింధామంలో రాత్రి దహనక్రియలు నిర్వహించారు.