తన తోటిపిల్లలందరిలాగా చదువుకొని, ఆటపాటలతో గడపాల్సిన ఆ చిన్నారి ప్రాణాలతో పోరాడుతుంది. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ ఆపన్నహస్తాల కోసం ఎదురుచూస్తోంది. వివరాల్లోకి వెళ్తే... ఖమ్మం జిల్లాకు చెందిన జయశ్రీకి 12 సంవత్సరాలు. ఆ బాలిక తండ్రి బండి వెంకటేశ్వర్లు రోజువారీ కూలీ. చక్కగా చదువుకుంటున్న ఆ చిన్నారిపట్ల విధి చిన్నచూపు చూసింది. గత రెండు సంవత్సరాల నుండి జయశ్రీ ల్యుకేమియా, బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతుంది. ఇప్పటివరకు ఆ చిన్నారి వైద్యానికి సేవింగ్స్ మరియు లోన్ల ద్వారా తల్లిదండ్రులు 18 లక్షలు ఖర్చుపెట్టారు.
ప్రస్తుతం ఆ బాలిక తెలంగాణలోని కిమ్స్ హాస్పిటల్ లో కీమోథెరపీ చికిత్స పొందుతోంది. ఆ పాప చికిత్స కోసం రాబోయే నెలరోజుల్లో ఇంకా రూ. 20,00,000 అవసరం. ఇక నుండి ప్రతీక్షణం కూడా చాలా విలువైనది. ఆ పాప వైద్యం కోసం ఇంక ఖర్చుపెట్టలేని నిస్సహాయ స్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు. ఆపన్నహస్తాల కోసం ఎదురుచూస్తున్నారు.
జయశ్రీకి కొత్తజీవితాన్ని ఇవ్వడానికి మీరు కూడా మీ వంతు సహాయ సహకారాలను అందించండి. మీరు చేసే చిన్న సాయం కూడా వారికి చాలా ఉపయోగకరం. దయచేసి సహాయం చేయగలరు.
జయశ్రీ చికిత్స కోసం సాయం చేయాలనుకునే వారు ఈక్రింది లింక్ పై క్లిక్ చేయండి.bit.ly/3iaokwl
-> మీ ఆర్ధిక పరిస్థితుల వలన మీరు సాయం చేయలేకపోయినా మీ బంధువులు, స్నేహితులకు షేర్ చేయడం ద్వారా పసిబిడ్డ ప్రాణాలు కాపాడడంలో మీ వంతు సాయం చేయగలరు.