ఏపీలో గత 24 గంటల్లో 706 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,891కి చేరింది. ఇప్పటితో కరోనాతో 6232 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 180 మంది మరణించారు. ప్రస్తుతం 7479 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, విజయనగరం జిల్లాలో ఒక్కరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు చనిపోయారు. మొత్తంగా గత 24 గంటల్లో మృతుల సంఖ్య 11 అని తేలింది.