వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆదివారం తిరుమలలోని శ్రీవారిస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చడంతో ఎంతో మంది పేదలకు మేలు జరుగుతుందని అన్నారు. కరోనాను ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొంటుందని ఆమె పేర్కొన్నారు. కరోనాతో అన్నిరాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. ఏపీలో కూడా ఆర్థిక సమస్య ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధైర్యంతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, అతడి కొడుకు లోకేష్ వ్యవహరిస్తున్న తీరుపై తనదైన శైలీలో విరుచుకుపడ్డారు.