చిన్న చిన్నవిషయాలకు ప్రాణాలు తీసుకోవడం ఈ మధ్యకాలం లో ఎక్కువగా చూస్తున్నాం తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. సజావుగా సాగే కుటుంబం కానీ వారి మధ్య బిర్యానీ చిచ్చు పెట్టింది. చివరికి అదే బిర్యానీ వారి కుటుంబంలో ఒకరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లా మహాబలిపురం సమీపంలోని పూంజేరిలో మనోహరన్, శరణ్య దంపతులు నివాసం ఉంటున్నారు, వీరికి ఇద్దరు పిల్లలు కొడుకు 11 ఏళ్ళు కూతురు 9 ఏళ్ళు. వీరు హాయిగా తమ జీవనాన్ని సాగిస్తున్నారు. అయితే వీరి జీవితంలో బిర్యానీ చిచ్చు పెట్టింది. గురువారం ఉదయం శరణ్య తనకి బిర్యానీ తినాలని కోరికగా ఉందని భర్త మనోహర ను బిర్యానీ తేవాల్సిందిగా కోరింది. శిల్పిగా పని చేస్తున్న మనోహరన్ కు లాక్ డౌన్ దెబ్బతో ఆర్థిక సమస్యలు ఎదురైనాయి. దాంతో తన వద్ద ప్రస్తుతం సరిపడా డబ్బు లేదని తరువాత ఎప్పుడైనా తెచ్చుకుందామని మనోహర అన్నాడు. దీంతో మనస్తాపానికి గురైన శరణ్య మనోహరన్ పై అలిగింది కొంత సమయం మాట్లాడలేదు పైగా ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. మనోహరన్ పనిమీద ఇనిటీ నుండి బయటకు వెళ్ళాడు అదే సమయంలో శరణ్య భర్త బండి లో నుండి పెట్రోల్ తీసి వంటి పై పోసుకొని నిప్పంటించుకుంది.