ఆగష్టు 12 వరకు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తూ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మెయిల్,ఎక్స్ ప్రెస్,ప్యాసింజర్,సబర్వన్ సర్వీసులను ఆగష్టు 12 వరకు రద్దు చేస్తునట్టు భారత రైల్వే శాఖ గురువారం ప్రకటించింది. ఆగష్టు 12 వరకు బుక్ చేసుకున్న టికెట్లను కూడా రద్దు చేస్తున్నామని వారికి రీఫండ్ ఇస్తామని రైల్వేశాఖ తెలిపింది. 230 ప్రత్యేక రైళ్లు మాత్రం యదావిధిగా కొనసాగుతాయని రైల్వేశాఖ ప్రకటించింది. కరోనా ప్రభావం రోజురోజుకు పెరుగుతుండడంతోనే రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. గతంలో మే 15న జూన్ 30 వరకు రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన రైల్వే శాఖ తాజాగా ఆగష్టు 12 వరకు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.