భారత్ లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. గత 24 గంటల్లో 15,968 మందికి కరోనా సోకింది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,56,183కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో 2,58,684 మంది కోలుకోగా 14,476 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,83,022 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. గత 24 గంటల్లో కరోనాతో 465 మంది చనిపోగా రికవరీలు 10,495గా ఉన్నాయి.