భార్య మృతి తట్టుకోలేక భర్త ఆమె చితిలో దూకి ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలోని గోండ్ పిప్రి తహశీల్దార్ పరిధిలోని భాంగ్రామ్ తలోధి గ్రామంలో సోమవారం జరిగింది. కిషోర్ ఖాతిక్ అనే యువకుడికి 2020 మార్చి 19ను రుచితా చిట్టావర్ తో పెళ్లి జరిగింది. వారి సంసార జీవితానికి గుర్తుగా ఆమె గర్భం దాల్చింది. రుచిత తల్లి అనారోగ్యానికి గురి కావడంతో ఆమె తన పుట్టింటికి వెళ్లింది. రుచితను తీసుకొచ్చేందుకు కిషోర్ అత్తగారింటికి వెళ్లాడు. అప్పటికే ఆమె ఇంట్లో లేదు. ఎక్కడికో బయటికి వెళ్లిందని కిషోర్ అనుకున్నాడు. కానీ తనకు ఏమైందో ఏమో తెలియదు కానీ బావిలో రుచిత మృతదేహం కనిపించింది. పెళ్లైన 3 నెలలకే భార్య మరణించడంతో తట్టుకోలేక ఆయన ఆమె చితిలో దూకాడు. దీంతో అతనిని అక్కడున్న వారు రక్షించారు. ఇంటికి వచ్చిన కిషోర్ ఆమె జ్ఞాపకాలను మర్చిపోలేక రుచిత ఆత్మహత్య చేసుకున్న బావి వద్దకు వెళ్లి ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో అక్కడ విషాదచాయలు అలుముకున్నాయి. రుచితను ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.