ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా సోకిందని కానిస్టేబుల్ ఆత్మహత్య

national |  Suryaa Desk  | Published : Wed, Jun 24, 2020, 08:46 AM

కరోనా సోకిందని ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా బస్సులో ఉరివేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. బెంగుళూరులో ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీసు శాఖలో కలకలం రేపింది. దీంతో ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. వైరస్ సోకినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన పని లేదని డీజీపీ అలోక్ కుమార్ సూచించారు. అందరూ ధైర్యంగా ఉండి వ్యాధిని ఎదుర్కోవాలని సిబ్బందిలో భరోసా నింపే ప్రయత్నం చేశారు. 


రిజర్వ్ పోలీస్ విభాగానికి చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్‌కు కరోనా అని తేలింది. అతన్ని సీవీ రామన్ ఆస్పత్రికి తరలించేందుకు మినీ బస్సు ఏర్పాటు చేశారు. వెళ్తున్న సమయంలో అతడు ఆ మినీ బస్సులోనే తన లుంగీతో గ్రిల్‌కు ఉరి వేసుకున్నాడు. ఆస్పత్రికి చేరాక డైవర్ తలుపుతీయగా విఘత జీవిగా కనిపించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వ్యాధి సోకిందనే భయంతోనే ఈ విధంగా చేశాడని నిర్థారించారు. కాగా ఇప్పటి వరకు అక్కడ 79 మంది పోలీసు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com