ముంబై: గడిచిని 24 గంటల్లో 55 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నిత్యం ప్రజాసేవలో ఉండే పోలీసులు కరోనా బారిన పడుతున్నారు. ఈ 55 మందిని కలుపుకొని మొత్తం కరోనా బారిన పడ్డ పోలీసుల సంఖ్య 4,103కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 48 మంది పోలీసులు మరణించారు. ఇప్పటి వరకూ మొత్తం 3,039 మంది పోలీసులు కోలుకోగా, 1,106 యాక్టివ్ కేసులు ఉన్నట్లు మహారాష్ట్ర పోలీసు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.