ఇండియా-చైనా మధ్య గాల్వాన్ లోయలో జరుగుతున్న సరిహద్దు ప్రతిష్టంభనపై కేంద్రానికి బహుజన సమాజ్ పార్టీ మద్దతు ఉంటుందని మాయావతి పేర్కొన్నారు. సరిహద్దు ఘర్షణలో ఓ కల్నల్ సహా 20 మంది భారత ఆర్మీ సైనికులు మృతి చెందడంతో దేశం మొత్తం విచారం, ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ‘ప్రభుత్వం, ప్రతిపక్షాలు రెండూ పూర్తి పరిపక్వతతో సంఘీభావంతో చేయాలని, అప్పుడే దేశానికి, ప్రపంచానికి సమర్థవంతమైందిగా నిరూపించబడుతుందన మాయావతి ట్వీట్ చేశారు. ఇలాంటి క్లిష్టమైన సమయంలో ప్రభుత్వం తదుపరి చర్యలపై ప్రజలు, నిపుణుల అభిప్రాయం భిన్నంగా ఉంటుందనీ, సరిహద్దును రక్షించడానికి ప్రభుత్వానికి వదిలివేయడమే మంచిదని సూచించారు.