ప్రధాన మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఓ మాట అనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని మన్మోహన్ సింగ్ అన్నారు. ఏవైనా పదాలను వాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని ఆయన అన్నారు. గత శుక్రవారం జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ లో నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు విమర్శలు గుప్పించాయి. ఇవాళ ఉదయం మన్మోహన్ సింగ్, ఓ ప్రకటన విడుదల చేశారు. "సరిహద్దులో భారత భూభాగాన్ని కాపాడేందుకు కల్నల్ బి.సంతోష్ బాబు, మన జవాన్లు చేసిన ప్రాణ త్యాగాలను తక్కువ చేసి చూడవద్దు. అది ప్రజల నమ్మకాన్ని వంచించినట్టే" అని మన్మోహన్ సింగ్ తెలిపారు. ఈ సమయంలో మనం చరిత్రాత్మక కూడలిలో నిలబడివున్నాం. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, చర్యలు భావి తరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని అన్నారు. మన ప్రజాస్వామ్యం ప్రధాని కార్యాలయంలోనే ఆగిపోయిందని జాతి భద్రత, సరిహద్దు అంశాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించే వేళ, జాతి భద్రతను మనసులో ఉంచుకుని మాట్లాడాలని అయన అన్నారు.