ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుడ్ న్యూస్..క్యాష్ విత్‌డ్రా లిమిట్ రెట్టింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 21, 2020, 04:42 PM

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా పంజాబ్ అండ్ మహరాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్ (పీఎంసీ బ్యాంక్) కస్టమర్లకు తీపికబురు అందించింది. క్యాష్ విత్‌డ్రా లిమిట్‌ను రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంక్ కస్టమర్లు ఇకపై రూ.లక్ష వరకు డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. గతంలో ఈ లిమిట్ రూ.50,000గా మాత్రమే ఉంది.ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో బ్యాంక్‌కు సంబంధించిన 84 శాతం మంది కస్టమర్లకు ప్రయోజనం కలుగనుంది. వీరందరూ బ్యాంక్ నుంచి వారి మొత్తం డబ్బులను వెనక్కి తీసుకోవచ్చు. అయితే ఆర్‌బీఐ మాత్రం పీఎంసీ బ్యాంక్‌పై ఆంక్షలను మాత్రం ఎత్తివేయలేదు. మరో ఆరు నెలలు వీటిని పొడిగించింది. ఇకపోతే మరోవైపు బ్యాంక్ కస్టమర్లకు RBI తీపికబురు అందించేందుకు రెడీ అవుతోంది. ఆర్‌బీఐ కమిటీ తాజాగా ఏటీఎం చార్జీలపై పలు ప్రతిపాదనలు చేసింది. దీంతో బ్యాంక్ కస్టమర్లకు కొంత మేర ప్రయోజనం కలుగనుంది. రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఆర్‌టీఐ) క్వైరీకి వచ్చిన రిప్లే ప్రకారం ఈ విషయం తెలుస్తోంది.ఆర్‌బీఐ కమిటీ ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయెల్స్‌పై చార్జీలు సిఫార్సు చేసింది. అయితే రూ.5,000కు మించి ఏటీఎం నుంచి డబ్బులు తీస్తేనే చార్జీలు విధించాలని తెలిపింది. అంటే రూ.5 వేలకు లోపు డబ్బులు ఏటీఎం నుంచి తీసుకుంటే ఎలాంటి చార్జీలు పడవు. దాదాపు చాలా మంది ఎక్కువ సార్లు ఏటీఎం నుంచి చిన్న చిన్న మొత్తాన్నే విత్‌డ్రా చేస్తూ ఉంటారు. వీరందరికీ ప్రయోజనం కలుగనుంది. ఏటీఎం నుంచి అధిక క్యాష్ విత్‌డ్రాయెల్స్‌ను నియంత్రించాలనే లక్ష్యంతో ఆర్‌బీఐ కమిటీ ఈ సిఫార్సు చేసింది. రూ.5,000 వరకు క్యాష్ విత్‌డ్రాయెల్స్‌పై చార్జీలు విధించొద్దని కోరింది. రూ.5 వేలు దాటిన లావాదేవీలపై బ్యాంకులు కావాలనుకుంటే ప్రతి ట్రాన్సాక్షన్‌కు చార్జీలు విధించుకోవచ్చని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com