ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీలకర్ర నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 20, 2020, 07:58 PM

నీటిలో జీలకర్ర వేసి మరిగించి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు. జీలకర్రలోని ప్రత్యేక గుణాలు శరీరంలోని అధిక కొవ్వుని తగ్గిస్తాయి. జీలకర్ర వేసిన నీటిని తాగడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గిపోతుంది. జీలకర్ర నీరు తాగడం వల్ల కొవ్వు తగ్గడమే కాదు. అనేక సమస్యలు కూడా దూరం అవుతాయి. ముఖ్యంగా కిడ్నీ రాళ్ల సమస్య దూరం అవుతుంది. ఈ నీటిని తాగడం వల్ల కిడ్నీల్లో చేరిన వ్యర్థాలు దూరం అవుతాయి.కొన్ని సార్లు కాస్త డిప్రెషన్‌గా ఫీల్ అవుతాం.. అలాంటప్పుడు జీలకర్రని మరిగించి అందులో నిమ్మరసం, తేనె కలిపి టీలా తీసుకుని చూడండి.. క్షణాల్లో సమస్య దూరం అవుతుంది. షుగర్ వ్యాధితో బాధపడేవారు కూడా జీలకర్ర నీటిని తాగడం వల్ల మేలు జరుగుతుంది. జీలకర్ర నీరు రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులోకి వస్తాయి. అందుకే రెగ్యులర్‌గా వీటిని తాగుతుండాలి. అంతేకాకుండు జీలకర్ర నీరు తాగేవారికి రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. దీంతో రక్త సరఫరా మెరుగుపడి గుండె సమస్యలు రావు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com