ఆదివారం ఖగోళంలో మరో అద్బుతం జరగబోతుంది. ఈ దశాబ్దంలోనే మొట్టమొదటిసారి కంటికి కనిపించే జ్వాలా వలయ గ్రహణం ఆదివారం ఏర్పడనుంది. ఈ గ్రహణం దేశ వ్యాప్తంగా సంపూర్ణంగా కనిపించదు. సూర్యగ్రహణం,చంద్రగ్రహణాలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ ఈ సూర్య గ్రహణానికి ప్రత్యేకత ఉంది. ఈ సూర్యగ్రహణం సమయంలో జ్వాలా వలయం కంటికి కనిపిస్తుంది. తెలంగాణలో ఉదయం 10.15 గంటల నుండి మధ్యాహ్నం 1.44 గంటల వరకు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఉదయం 10.21 గంటల నుండి మధ్యాహ్నం 1.49 గంటల వరకు 46 శాతం గ్రహణం కనబడుతుందని నిపుణులు తెలిపారు.గ్రహణాల సమయాన కొంత మంది కొన్నింటిని నమ్ముతుంటారు. మరికొందరు వాటిని కొట్టిపారేస్తుంటారు. ఈ సూర్య గ్రహణం వల్ల మేష,మకర,కన్య,సింహ రాశివారు అత్యంత శుభ ఫలితాలు పొందుతారని పండితులు తెలిపారు. వృషభ,కుంభ,ధనుస్సు,తుల రాశుల వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. మిథున,మీన,వృశ్చిక,కర్కాటక రాశి వారికి అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.గ్రహణ సమయంలో ఏం తినకూడదు,గర్భిణీ స్త్రీలు బయటికి రాకూడదు అని చెప్పేవి మూఢ నమ్మకాలని వాటిని నమ్మకూడదని నిపుణులు తెలిపారు. గ్రహణ సమయంలో కూడా సాధారణ సమయంలో ఉన్నట్టే ఉండవచ్చన్నారు. ఈ సూర్య గ్రహణంలో జ్వాలా వలయాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుంది. సూర్యున్ని నేరుగా చూడకుండా కూల్ గ్లాసెస్ ద్వారా చూస్తే ఉత్తమం.ఈ బిజినెస్ తో నెలకు 2 లక్షల ఆదాయం: getlokalapp.com/share/posts/1210873