జూన్ 18 9AM: చైనాతో ఘర్షణలో మరణించిన కల్నల్ సంతోష్ బాబు అంతిమ యాత్ర సూర్యాపేటలో ప్రారంభం.
జూన్ 17, 6PM: భారత్,చైనా విదేశాంగ మంత్రులు ఫోన్లో మాట్లాడుకున్నారు. భారతే దుస్సాహసానికి పాల్పడిందని చైనా విదేశాంగ మంత్రి అన్నారు. భారత సైనికులను శిక్షించాలని ఆయన అన్నారు. దీనికి ప్రతిగా భారత విదేశాంగ మంత్రి సమాధానమిచ్చారు. చైనా ప్లాన్ ప్రకారం చేసి ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ పోరాటానికి సిద్దమే తప్ప వెనుకడుగు వేయదన్నారు. కానీ తాము శాంతిని కోరుకుంటున్నామని మంత్రి చైనాకు స్పష్టం చేశారు.
జూన్ 17, 5 PM: ఇండో-చైనా సరిహద్దు ప్రాంతమైన గాల్వాన్లో ఘర్షణలో 35 మంది చైనా సైనికులు చనిపోయినట్టు అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. చైనా యూనిట్కు చెందిన కమాండింగ్ ఆఫీసర్ కూడా మృతుల్లో ఒకరని అమెరికా నివేదిక తెలిపింది.
జూన్ 17 మధ్యాహ్నాం 3.30 గంటల సమయంలో భారత్,చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులున్నాయని సమచారం.
జూన్ 17 మధ్యాహ్నాం 3 గంటలకు ప్రధాని మోడీ చైనాకు గట్టి హెచ్చరిక. భారత సార్వభౌమత్వాన్ని దెబ్బ తీస్తే ఊరుకునేది లేదని చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్.
జూన్ 17 మధ్యాహ్నాం 2 గంటలకు ప్రధాని మోడీ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం.
జూన్ 17 ఉదయం 11 గంటలకు అమరుడైన తెలంగాణ కల్నల్ సంతోష్ భార్య,పిల్లలు ఢిల్లీ నుంచి హైదరాబాద్ రాక.
జూన్ 17 ఉదయం 10 గంటలకు గాల్వాన్ లోయ నుంచి ఇరు దేశాల సైనికులు వెనక్కి వెళ్లారని సమాచారం.
జూన్ 17 అమరులైన వీర సైనికుల మృతదేహాలు వారి ప్రాంతాలకు తరలించే ప్రక్రియ ప్రారంభం. అధికారిక లాంఛనాలతో వారి అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయం.
జూన్ 16 రాత్రి 11 వరకు 10 మంది భారత జవాన్ల మృతదేహలు గుర్తింపు.
ఇరు దేశాలకు సంబంధించిన దౌత్య,సైనిక అధికారులు స్థాయిలో చర్చలు ప్రారంభం.
జూన్ 16 రాత్రి 10 గంటలకు భారత్,చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది ఇండియన్ జవాన్లు మరణించారని ఆర్మీ తెలిపింది. 43 మందికి పైగా చైనా సైనికులకు కూడా నష్టం కలిగిందని ఆర్మీ తెలిపింది.
జూన్ 16 మంగళవారం చనిపోయిన జవాన్ల కుటుంబానికి ఇండియన్ ఆర్మీ సమాచారమిచ్చింది.
జూన్ 15 సోమవారం రాత్రి 10 నుంచి 11 గంటల ప్రాంతంలో భారత్ - చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో భారత్ - చైనా సైనిక బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ ఘర్షణలో భారత సైన్యానికి చెందిన ఒక అధికారితో పాటు ఇద్దరు జవాన్లు చనిపోయారని ఇండియన్ ఆర్మీ చెప్పింది. భారత జవాన్ల పై చైనా ఆర్మీతో పాటు పాక్ ఆర్మీ కూడా దాడి చేసినట్టు సమాచారం. భారత సైనికులను వెంటపడి వెంటపడి పాశవికంగా హత్య చేసినట్టు తెలుస్తోంది.