ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్కడ 730 మంది మటన్ ప్యాకింగ్ సిబ్బందికి కరోనా...

international |  Suryaa Desk  | Published : Fri, Jun 19, 2020, 12:37 PM

జర్మనీలోని నార్త్ రైన్-వెస్ట్‌ఫాలియా (ఎన్ఆర్‌డబ్ల్యూ)లో ఓ కబేళాకి చెందిన 730 మంది సిబ్బందికి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు. దీంతో గిటర్స్లోహ్ జిల్లాలోని టోనీస్ గ్రూప్‌ మీట్ ప్యాకింగ్ ప్లాంట్‌ను తాత్కాలికంగా మూసివేస్తూ స్థానిక అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 7 వేల మందిని క్వారంటైన్‌లో ఉంచారు. ఈ నెల 29 వరకు స్కూళ్లు, డేకేర్ కేంద్రాలను మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.  వచ్చే మరికొద్ది రోజుల్లో 5 వేలకు పైగా కొవిడ్-19 పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. మరోవైపు ఈ ప్లాంటులో కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందిందనే దానిపై ఎన్ఆర్‌డబ్ల్యూ ప్రభుత్వం విచారణ చేపట్టింది. గత నెల ఇదే రాష్ట్రంలోని కోస్‌ఫెల్డ్‌ జిల్లాకి చెందిన మరో మీట్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో 200 మందికి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com