టీడీపీ నేత,మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్టు పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలో భాగంగా సీఎం జగన్ అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారన్నారు. ముందుగా నోటిసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించారు. అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేశారన్నారు. అచ్చెన్నాయుడికి ఏం జరిగినా సీఎం జగన్ దే బాధ్యతన్నారు. కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడడం తగదని ఆయన హితవు పలికారు.