ఏపీ కరోనా బులెటిన్ విడుదలైంది. గత 24 గంటల్లో 141 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4402కి చేరింది. ఇప్పటి వరకు 2599 మంది డిశ్చార్జ్ కాగా 80 మంది కరోనా పాజిటివ్ తో మృతి చెందారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1723గా ఉంది. రాష్ట్రంలో విదేశాల నుంచి వచ్చిన వారికి 199 మందికి కరోనా సోకగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 1035 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5636కి చేరింది.